వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మన టాలీవుడ్ దర్శకులపైనే అందరి ద్రుష్టి పడింది.వాళ్ళు ఏం చేస్తున్నారు.
ఎక్కడకు వెళ్తున్నారు అంటూ మిగతా ఇండస్ట్రీల వారు కూడా ఆరాలు తీస్తున్నారంటేనే తెలుస్తుంది మన టాలీవుడ్ పై ఎంత ద్రుష్టి పెట్టారు అనేది.తాజాగా మన టాలీవుడ్ దర్శకుల్లో నలుగురు కలిసి ముంబైలో మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఇంతకీ ఆ దర్శకులు ఎవరా అని ఆలోచిస్తున్నారా.ఆగండి అక్కడికే వస్తున్నాం.ఈ నలుగురు దర్శకులు ముంబై లోకి ఒక హోటల్ లో సమావేశం అయ్యారు.ఈ విషయం బయటకు ఎలా వచ్చిందా అని అనుకుంటున్నారా ప్రముఖ నటి నిర్మాత అయినా ఛార్మి కౌర్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ప్రశ్న వదిలారు.
ఈ నాలుగు దర్శకులు కలిసి ఏం మాట్లాడు కుంటున్నారో గెస్ చేయండి అంటూ ఛార్మి పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.
ఆ నాలుగు డైరెక్టర్లు ఎవరంటే పూరి జగన్నాథ్, క్రిష్ జాగర్లమూడి, జయం మోహన్ రాజా, నిశ్శబ్దం డైరెక్టర్ హేమంత్ ఈ నాలుగు మాట్లాడుకుంటూ ఉండగా ఉన్న ఫోటోను ఛార్మి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.మరి ఛార్మి పోస్ట్ కు అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు.కొంతమంది తమ సినిమాల విషయాలు మాట్లాడు కుంటున్నారు అంటూ గెస్ చేసారు.
అయితే మరి కొంత మంది మాత్రం.ఈ చర్చ అంత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గురించి అని చెబుతున్నారు.గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సమావేశం చూస్తుంటే పాన్ ఇండియా మార్కెట్ పై ఈ దర్శకులు ద్రుష్టి పెట్టినట్టు అందుకే ఎలాంటి ఎత్తులు వేసి హిందీ మార్కెట్ లో టాలీవుడ్ జెండా పాతాలి అని చర్చించు ఉంటారని అంచనాలు వేస్తున్నారు.