సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తారో అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది.ముఖ్యంగా సినిమా హిట్ అయితే ఒకలా ఫ్లాప్ అయితే మరోలా స్పందిస్తూ ఉంటారు ప్రేక్షకులు.
దీంతో ఇక స్టార్ హీరోలతో సినిమా తీస్తున్న దర్శకులు అందరికీ పీక మీద కత్తి పెట్టి నట్లు గానే ఉంటుంది పరిస్థితి.ఒక సినిమా హిట్ అయిందంటే మా హీరో భలే చేసాడు.
అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటూ ఉంటారు.అదే ఫ్లాప్ అయితే ఈ దర్శకుడికి సరిగా తీయడం రాలేదు అందుకే తమ అభిమాన హీరో చేసిన కూడా సినిమా హిట్ అవ్వలేదు అంటూ మొత్తం దర్శకుడి మీదకి నెట్టేస్తున్నారు.
అప్పటివరకు సూపర్ హిట్ లు అందించిన దర్శకుడికి కూడా ఒక ఫ్లాప్ వచ్చిందంటే విమర్శలు మాత్రం తప్పడం లేదు అని చెప్పాలి.ఇప్పుడు కొరటాల శివ పరిస్థితి అలాగే మారింది.2013లో కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ ఇప్పటివరకు తీసింది ఐదు సినిమాలే.ఇక ఐదు సినిమాలు సూపర్ హిట్.
ఓటమి తెలియని దర్శకుడు గా కొనసాగుతున్నాడు.ఇక ఇటీవలే చిరంజీవి చరణ్ కాంబినేషన్ లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో అందరూ కొరటాల శివ ను ఆడిపోసుకుంటున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటూ ఉంటారు.రాజమౌళి చేసినవి 10 సినిమాలే అయినా సాదా సీదా హీరోలను తన సినిమాలతో బిగ్ స్టార్ లుగా మార్చాడూ.అయితే ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నాయి.ఇటీవలే వచ్చిన త్రిబుల్ ఆర్ విషయంలో మాత్రం కాస్త లెక్క తప్పింది.మల్టీస్టారర్ కావడం రాజమౌళి దర్శకత్వం వహించడంతో ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి.కానీ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు అన్నది తెలిసిందే.
దీంతో ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన రాజమౌళి ని కూడా వదల్లేదు ప్రేక్షకులు.రాజమౌళి పని అయిపోయిందని డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటూ ఎన్నో మాటలు అన్నారు.
ఇలా ఇప్పుడు సినిమా తీస్తున్న డైరెక్టర్స్ పీక మీద కత్తి ఉన్నట్లుగానే మారిపోయింది పరిస్థితి.