ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి దర్శకుల్లో టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు.అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి పూరి జగన్నాథ్ ఈ మధ్య మోటివేషనల్ వర్డ్స్ చెబుతూ సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.
అయితే తాను ఈ మధ్య యూరప్ వెళ్లానని అయితే అక్కడ మానవ జీవితానికి సంబందించిన ఓ ఆసక్తికర అంశాన్ని గమనించానని ఆ విషయం గురించి తెలిపాడు. అయితే ఇందులో భాగంగా మామూలుగా ఎవరైనా పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు లేదా మరే ఇతర వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా ఆసక్తి కనబరుస్తుంటారు కానీ అక్కడి ప్రజలు మాత్రం తమ చావుని కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు చనిపోయే ముందు సన్నాహాలు చేసుకుంటారని తెలిపాడు.
అయితే తాము చనిపోయిన అనంతరం తమ తన భౌతిక కాయాన్ని పూడ్చి పెట్టడం నుంచి చివరికి సెండాఫ్ పార్టీ కి వచ్చినటువంటి వారికి ఎలాంటి సదుపాయాలు భోజనాలు కల్పించాలనే విషయం గూర్చి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని తన కళ్ళ ముందే ఇద్దరు దంపతులు తమ మరణానంతరం తమ చావుని ఎలా సెలబ్రేట్ చేయాలనే విషయంపై ఓ ప్యాకేజీ ని తీసుకుని వెళ్లినట్లు గమనించాను అని కూడా తెలిపాడు.
దీంతో పూరి జగన్నాథ్ చావు సెలెబ్రేషన్స్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మామూలుగా స్టోరీ సెట్టింగ్ కోసం ఇతర దేశాలకు వెళ్లేటువంటి పూరి జగన్నాథ్ ఇలాంటి విషయాలపై బాగా ఆసక్తి ఉన్నందున వాటి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయిన అనంతరం తన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి “ఆటో జానీ” అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు సమాచారం.