టాలీవుడ్ దర్శకుడు పరుశురామ్ దశకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మంచి హిట్ టాక్ కు తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు పరశురామ్.
ఈ సినిమా తరువాత దర్శకుడు పరశురామ్ వరుసగా సినిమాలు తిరగకెక్కిస్తూ బిజీబిజీ అవుతాడు అని అభిమానులు, సిరి ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.కానీ దర్శకుడు పరశురామ్ కెరిర్ కు సర్కారు వారి పాట సినిమా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేక పోయింది అన్నది తాజాగా అందిన సమాచారం.
ఎందుకంటే ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు పూర్తి అయినా కూడా పరశురాం తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు.
కాగా సర్కారు వారి పాట సినిమా విడుదల తర్వాత దర్శకుడు పరుశురామ్ నాగచైతన్యతో సినిమా ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటికీ, ఆ ప్రాజెక్టు పై ఎటువంటి అధికారికంగా ప్రకటన కూడా రాలేదు.
కాగా ప్రస్తుతం నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ ను చేయడంతో పాటు, వెంకట్ ప్రభు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా డీజే తీల్లు సినిమా దర్శకుడు విమల్ కృష్ణకు కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది.దీన్నిబట్టి చూస్తే నాగచైతన్య వచ్చే ఏడాది వరకు ఫుల్ బిజీ బిజీగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.మరి దర్శకుడు పరశురాం అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే అని సినీ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా తర్వాత నాగచైతన్యతో పరుశురాం సినిమా పట్టా లెక్కించాల్సి ఉండగా కానీ మహేష్ బాబు సినిమా అవకాశం రావడంతో పరుశురామ్ మొదట సర్కారీ వారి పాట సినిమాలో తెరకెక్కించే పనిలో పడ్డారు.ఈ ఆ సమయంలో నాగచైతన్యను హోల్డ్ లో పెట్టారు.ప్రస్తుతం నాగచైతన్య వరసగా సినిమాలు చేస్తూ దర్శకుడు పరశురామ్ ను హోల్డ్ లో పెట్టాడు.
మరి నాగచైతన్యతో తెరకెక్కించే సినిమా రాబోయే వరకు ఖాళీగా ఉంటారా లేదంటే ఆలోపు మరొక ప్రాజెక్టును టేకప్ చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.