సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో మొదలు పెట్టి అనుకోకుండా స్టార్స్ అయినవారు చాలా మందే ఉన్నారు.హాస్యనటులుగా నటించి హీరో అయినవారు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయినవారు ఉన్నారు.
ఇక హీరో నుంచి నిర్మాతలుగా మారినవారు ఉన్నారు.అలాగే టాప్ డైరెక్టర్స్గా ఎదిగిన చాలా మంది పొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
ఇక టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన డైరెక్టర్స్.ఇటీవల నిర్మాతలుగా మారుతున్నారు.అలాంటి వారి గురించి తెలుసుకుందాం.
1.అనిల్ రావిపుడి.గాలీ సంపత్
సుప్రీం, రాజా ది గ్రేట్, పటాస్, సరిలేరు నీకెవ్వరు, F2 వంటి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి.ఇటీవల నిర్మాతగా మారి శ్రీవిష్ణు హీరోగా గాలి సంపత్ సినిమాను నిర్మించాడు అనిల్.అంతేకాకుండా… ఆసినిమాకు పర్యవేక్షణ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
2.నాగ్ అశ్విన్.జాతి రత్నాలు
అలనాటి సీనియర్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కించి.విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.ఇందులో కీర్తి సురేష్ సావిత్రిగా నటించింది.ఇక నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి నవిన్ పోలిశెట్టి హీరోగా జాతిరత్నాలు సినిమాను నిర్మించాడు.
3.త్రివిక్రమ్ శ్రీనివాస్.చల్ మోహన్ రంగా
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.అగ్రహీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్.నిర్మాతగా మారిన చిత్రం చల్ మోహన్ రంగా.
4.సుకుమార్ – కుమారి 21F
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఆర్య బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా కుమారి 21F సినిమాను నిర్మించాడు.
5.సంపత్ నంది.గాలిపటం .
డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా, రచయితగా పనిచేసి నిర్మించిన చిత్రం
6.క్రిష్.అంతరిక్షం .
వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన డైరెక్టర్ క్రిష్.వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం మూవీని ప్రొడ్యూస్ చేశారు.
7.శేఖర్ కమ్ముల – అవకాయ బిర్యానీ.
హ్యాపి డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, కేరింత వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్మాతగా మారి అవకాయ బిర్యానీ సినిమాను నిర్మించాడు.
8.వైవీఎస్ చౌదరీ – నిప్పు.
డైరెక్టర్ వైవీఎస్ చౌదరీ నిర్మాతగా మారి.మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గుణశేఖర్ కాంబోలో నిప్పు సినిమాను నిర్మించారు.
9.ఎస్ ఎస్ రాజమౌళి – కవితా ప్రేమకథ.
దర్శకధీరుడు రాజమౌళి.నిర్మాతగా మారిన సినిమా కవితా ప్రేమకథ నిర్మించాడు.
10.పూరీ జగన్నాథ్.బంపర్ ఆఫర్.
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.తన తమ్ముడిని హీరోగా పెట్టి.నిర్మించిన సినిమా బంపర్ ఆఫర్.ఈ సినిమాకు డైలాగ్స్, స్టోరీ, ప్రొడ్యూసర్ గా పూరీ పనిచేశాడు.