ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఈ కరోనా మహమ్మారి మానవుల జీవితాలను అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇందులో ఎంతో మంది ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు.
రైతులు కనీస వసతులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.చివరికి చేసేదేమీ లేక వలస కార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.
అయితే తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో దర్శకత్వ సంబంధిత రంగంలో పని చేస్తున్నటువంటి “భైరు సిద్దు” అనే నూతన దర్శకుడు గత కొద్దికాలంగా షూటింగులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.అతడి కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
కానీ ఈ కరువు కాలంలో వారికి వ్యవసాయం చేసేందుకు ఎద్దులు లేకపోవడంతో వ్యవసాయ పనులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో షకలక శంకర్ బైరు సిద్దు కుటుంబానికి జత ఎద్దులు మరియు నాగలి అందించాడు.
దీంతో షకలక శంకర్ చేసినటువంటి ఈ పనికి ఆ కుటుంబ సభ్యులు జీవితాంతం రుణపడి ఉంటామంటూ ఎమోషనల్ అయ్యారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా షకలక శంకర్ చేసినటువంటి ఈ సాయానికి అభినందనలు తెలుపుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శకలక శంకర్ “డ్రైవర్ రాముడు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అలాగే రామ్ గోపాల్ వర్మ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ వెబ్ సీరీస్ లో కూడా షకలక శంకర్ .నటిస్తున్నాడు.