ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకుపోతుంది.అంతేకాక ఈ అమ్మడు స్టార్ హీరో రేంజ్ ఉన్నటువంటి హీరోల చిత్రాల్లో మాత్రమే నటించేందుకు అంగీకరిస్తోంది.
అయితే తాజాగా పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ప్రేక్షకులపై చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో దుమారం రేపుతున్నాయి.ఇందులో పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కేవలం తన నడుము మరియు తొడలు, బొడ్డు తదితర వాటిని మాత్రమే చూస్తారని అంటూ కొంత మేరా బోల్డ్ గా కామెంట్లు చేసింది.
దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే ని కొందరు నెటిజన్లు నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేగాక ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ టాలీవుడ్ లోని కొందరు ప్రముఖ సినీ దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకుండా బాలీవుడ్ హీరోయిన్లను ప్రోత్సహిస్తున్నారని, కానీ వారు మాత్రం టాలీవుడ్ ని చిన్నచూపు చూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక బాలీవుడ్ హీరోయిన్లు కేవలం సినీ అవకాశాల కోసం మాత్రమే టాలీవుడ్ కి వస్తారని, ఇక్కడ మంచి ఫేమ్ మరియు స్టార్ డమ్ వచ్చిన తర్వాత మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోతారని ఈ కోవలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారని అంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నారు.
అయితే తాజాగా ఈ అమ్మడు చేసినటువంటి వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ స్పందిస్తూ ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ చేయడం వల్లే దర్శక నిర్మాతలు ఈ అమ్మడుని పిలిచి మరి సినిమా అవకాశాలు ఇస్తున్నారని తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ షేర్ చేశాడు.
అంతేగాక ఇందులో పూజ హెగ్డే చూడడానికి బొంబాయి మోడల్ లా ఉంటుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీంతో ప్రస్తుతం పూజ హెగ్డేపై కత్తి మహేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేగాక కొంత మంది నెటిజన్లు పూజా హెగ్డే తెలుగు సినీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.