నా దగ్గర  పోలీసులు 5 లక్షలు లంచం తీసుకున్నారంటున్న నటి...

ఇటీవలే పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి నటి సుధా రెడ్డి టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్.కే.నాయుడు తనను ప్రేమించి, సహజీవనం కూడా చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నటి సుధా రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తెలియడంతో శ్యామ్.

 Sudha Redddy, Tollywood Character Artist , Sensational Comments, Police Si, Conc-TeluguStop.com

కె.నాయుడు ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పలు చట్టాల కింద కేసులు కూడా నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.అనంతరం శ్యామ్.కె.నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి సుధా రెడ్డి తాను న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్లగా అదే స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్నటువంటి ఓ పోలీసు అధికారి తనకు న్యాయం చేస్తానని అంటూ దాదాపుగా 5 లక్షల రూపాయలు తన నుంచి లంచంగా తీసుకున్నాడని ఆరోపణలు చేస్తోంది.

అంతేగాక తాను ఆ పోలీసు అధికారికి లంచం ఇచ్చే క్రమంలో తీసుకున్నటువంటి ఫోటోలు మరియు ఆడియో టేపులతో సహా అన్నీ పక్కా ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత కాలంలో కొందరు న్యాయం కోసం తమ దగ్గరకు వచ్చినటువంటి బాధితులను ఆసరాగా తీసుకొని డబ్బులు గుంజుతున్నారని పోలీసుల  తీరుని  తప్పుబడుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి సుధా రెడ్డి పలు టాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అంతేగాక ఈ మధ్యనే ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube