ఒకప్పుడు సినీ ఇండస్ట్రీకి కేంద్రంగా చెన్నై ఉండగా.ఇప్పుడు ముంబై అడ్డగా మారింది.
అందుకు ఒకప్పుడు చెన్నైలో ఇండ్లు కొనుకున్న సినీ తారలు.ప్రస్తుతం ముంబైల్లో భవంతులు తీసుకుంటున్నారు.
ఇంతకీ టాలీవుడ్ నటులు ఎవరెవరికి ముంబైలో ఇండ్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!
మిషన్ మజ్నూ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది రష్మిక.అక్కడికి వెళ్లిన ప్రతిసారి హోటల్లో ఉండడం ఇష్టం లేక ఓ ఇల్లు కొనుక్కుంది.బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ఆమె ముంబైలోనూ ఇంటిని తీసుకుంది.
బాలీవుడ్లో నటిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న పూజా హెగ్డే ముంబైని తన అడ్డాగా మార్చుకోవాలనుకుంటుంది.ప్రస్తుతం ప్రభాస్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తుంది.తాజాగా బాంద్రాలో కొత్త 3 బిహెచ్కె ఇల్లు కొనుగోలు చేసింది.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ముంబై లో ఫ్లాట్ కొన్నాడు.విలాసవంతమైన 2బిహెచ్కె ఇల్లును ఆరేళ్ళ క్రితమే తీసుకున్నాడు.ఇంటిని అందమైన ఇంటీరియర్స్ పెయింటింగ్స్తో తయారు చేయించాడు.
తుఫాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన రామ్ చరణ్ అక్కడ ఫ్లాట్ కొన్నాడు.బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటికి దగ్గర ఓ ఇల్లు 2012 లో కొన్నాడు.
అటు కాజల్ అగర్వాల్ కు ఎప్పటి నుంచో ముంబైలో ఇల్లు ఉంది.ఐకానిక్ మెరైన్ డ్రైవ్లో ఆమెకు ఒక ఇల్లు ఉంది.ఆమెకు చిన్నప్పటి నుంచి అక్కడ ఇల్లు ఉంది.
2019 లో తమన్నా ముంబైలోని సూపర్ లావిష్ ఫ్లాట్ తీసుకుంది.జుహు-వెర్సోవా లింక్ రోడ్ లోని బేవ్యూలో తన ఫ్లాట్ ఉంది.
ఇక పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్న ప్రభాస్ సైతం మంచి ఇంటి కోసం చుస్తునందట.వంద కోట్ల పారితోషకం తీసుకునే ప్రభాస్ ముంబై లో ఇల్లు కొనడంలో పెద్ద వింతేముంది అనుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
ఇవండీ మన తెలుగు నటీనటులు ముంబై నివాసం అసలు ముచ్చట్లు.నిజానికి ఈ నటీనటులంతా ముంబై ఎందుకు ఇంత మోజు పడుతున్నారో ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉండచ్చు.
వీరంతా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు అందుకే ముందు జాగ్రత్త కోసం ముచ్చట పడి మరి సొంత ఇల్లు కొనేస్తున్నారు.