తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మరణించిన సంగతి తెలిసిందే.దీంతో సినీ పరిశ్రమలోని పలువురు సినీ పెద్దలు మరియు సెలబ్రిటీ హీరోలు రామారావు కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రామారావు మరణం పట్ల స్పందించారు.ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్టు రామారావు మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని తనను రామారావు మరణ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
అంతేకాక తన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రామా రావు మృతి పట్ల స్పందిస్తూ సీనియర్ జర్నలిస్ట్ రామారావు అకాల మరణం తనని ఎంతో బాధకి గురి చేసిందని అన్నారు.అంతేగాక చిన్నప్పటి నుంచి తనకు వ్యక్తిగతంగా రామారావు గారితో మంచి పరిచయం ఉందని ఆయన మరణవార్త విన్న వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.అలాగే తన కుటుంబానికి అవసరమైతే తన వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తానని అన్నారు.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మృతి పై స్పందించారు.రామారావు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.అంతేకాక సినీ పరిశ్రమకి తాను చేసిన సేవలు మరువలేనివని ఈ కారణంగా రామారావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.