సినిమా.ఇది ఒక రంగుల ప్రపంచం.
ఎవరి జీవితం ఏ క్షణాన తారుమారు అవుతుందో అసలు చెప్పలేం.ఇక అలానే.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకే అద్భుతమైన స్టార్ డాం సంపాదిస్తారు.వారిని చుసిన ప్రేక్షకులు ఎంతో ఎత్తుకు వెళ్తారు అని భావిస్తారు.
కానీ ఏం జరుగుతుందో తెలీదు.అప్పుడప్పుడే ప్రేక్షకులను సంపాదించుకునే సెలబ్రెటీలు ఒక్కసారిగా మాయం అవుతారు.
వారు ఎవరు అనేది మనం ఇప్పడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
వేణు తొట్టెంపూడి :
హీరోగా నటించిన మొదటి చిత్రం స్వయంవరం సూపర్ హిట్ కొట్టింది.దీంతో వేణుకు వరుసగా సినిమాలు వచ్చాయ్.మంచి కమెడియన్ గా ప్రేక్షకులను అలరించాడు.
అయితే ఏమైందో ఏమో గెస్ట్ రోల్ గా నటించిన వేణు సినిమాలలో కనిపించకుండా పోయాడు.
తరుణ్ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తరుణ్ కొద్దీ కాలానికే నువ్వే కావాలి సినిమాతో హీరోగా నటించి అమ్మాయిల మనసు దోచుకున్నాడు.ఆతర్వాత మంచి ప్రేమకథలను ఎంచుకొని సినిమాలు తీసిన తరుణ్ సినిమాలకు దూరం అయ్యి ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాడు.
వడ్డే నవీన్ :
తండ్రి బ్యాగ్రౌండ్ తో మంచి నటనతో సినిమాలలోకి వచ్చిన వడ్డే నవీన్ మంచి కథలు ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అలా సినిమాలు తీస్తూనే మద్యలో కొద్దీ గ్యాప్ వచ్చింది.అనంతరం ఓ సినిమాలో గెస్ట్ రోల్ గా చేసి తర్వాత సినిమాలలో కనిపించకుండా పోయాడు.
జై ఆకాష్ :
తమిళ్, తెలుగు భాషల్లో నటించిన ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.మంచి సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.మంచి హీరో అవుతాడు అనుకున్న ఆకాష్ కు సినిమాల్లో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
తారక రత్న :
ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎక్కువ కాలం నటుడుగా నిలదొక్కుకోలేకపోయాడు.ఈ హీరోకి బ్యాక్ గ్రౌండ్ కూడా ఉపయోగపడలేదు.
రాజా :
ఫీల్ గుడ్ చిత్రాల నటుడు.శేఖర్ కమ్ముల చిత్రం ఆనంద్ లో నటించిన ఈ హీరో మంచి ఫెమ్ సంపాదించుకున్నప్పటికి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.