తెలంగాణ ఎన్నికల్లో పార్టీలు ఓటర్లను ఆకర్షించే విధంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.ఒక వైపు పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణం లో … ప్రత్యర్థుల కంటే పై చేయి సాధించేందుకు ఎవరికీ వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి.ఒకప్పుడు టీడీపీకి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అండదండగా ఉండేవారు.అయితే… తెలంగాణ ఏపీలు విడిపోవడం చిత్ర సీమ మొత్తం తెలంగాణ కేంద్రం గా ఉన్న హైద్రాబాద్ లో ఉండడం అక్కడ టీఆర్ఎస్ అధికారం లో ఉండడంతో … చిత్ర సీమకు చెందిన వారంతా మెల్లి మెల్లిగా టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు.టీఆర్ఎస్ కి చెందిన కేటీఆర్ .ఆమె సోదరి కవిత కూడా వారితో స్నేహంగా ఉంటూ బాగా దగ్గరవ్వడం ఇప్పుడు టీఆర్ఎస్ కి బాగా కలిసొచ్చింది.
ఈ నేపథ్యంలో….టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారు.ఇందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు గతంలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని, మళ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అధికారం లోకి వస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.ఈ కోవలో అగ్ర హీరోలు మీడియా ముందుకు వచ్చి మరీ మద్దతు తెలుపుతున్నారు.
హీరో నాగార్జున – కేటీఆర్కి చాలా సన్నిహితంగా ఉంటారు.గతంలో కోరగానే నాగార్జున స్వచ్ఛ భారత్లో పాలుపంచుకున్నారు.
ఇక నాగార్జున కోడలు సమంత ప్రస్తుతం తెలంగాణ చేనేత వస్త్ర రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.ఈ సందర్భంలో టీఆర్ఎస్ గెలవాలంటూ వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ముక్కుసూటిగా మాట్లాడుతూ… కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నటుడు.రచయిత పోసాని కూడా టీఆర్ఎస్ కే నా ఓటు అంటూ ప్రకటించేశాడు.అంతే కాదు కేసీఆర్ వల్లనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ గెలవాలంటూ ప్రకటించారు.డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా కేసీఆర్ పాలన భేష్ అంటూ మాట్లాడారు.
ఈ మధ్య చిరంజీవి సంతోషం అవార్డు వేడుకల్లో మాట్లాడుతూ నిజంగా కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా అవార్డు అందుకున్నాడని చెప్పడం, తెలుగు చిత్ర పరిశ్రమకు కేసీఆర్ ఎంతో సేవ చేశారని సభలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఇలా వరుసాగా టాలీవుడ్ ప్రముఖులంతా టీఆర్ఎస్ కి మద్దతు పలకడం టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని రేపుతోంది.