ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది.ఇక ఏపీలో రాజకీయ్ నేతలు అందరూ తమ ఓటుని ఇప్పటికే వినియోగించుకున్నారు.
ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటుని వినియోగించుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
అలాగే చిరంజీవి దంపతులు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఇక ఏపీలో పలు ప్రాంతాలలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతూ ఉండగా, రాయలసీమ ప్రాంతంలో మాత్రం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట, అలాగే పోలింగ్ బూతుల దగ్గర ఓటర్స్ ని ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు నేపధ్యంలో పార్టీల ఏజెంట్స్ అందరూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేసారు.