సంక్రాంతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఏపీలో కోళ్ల పందాలు.రెండు మూడు రోజుల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి.
ప్రతి ఒక్కరు కూడా ఈ కోళ్ల పందెంలో అంతో ఇంతో పెట్టాలని వెళ్తూ ఉంటారు.కొందరు మాత్రం ఒక మోస్తరుగా పెట్టి పోయిన వెంటనే వెనక్కు వస్తారు.
కాని కొందరు మాత్రం పోతూనే ఉంటే పెడుతూనే ఉంటారు.కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు.
పందెం కోడి పై వేలు లక్షల రూపాయలు పెట్టిన వారు చాలా మంది ఉంటారు.పందెం కోళ్లను పెంచే సెలబ్రెటీలు కూడా ఉంటారు.
తాజాగా సంక్రాంతికి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది పందెం కు వెళ్లారు.కోడి పందెం కోసం ఏపీకి వెళ్లిన ఒక సినీ నటుడు అక్కడ లక్షల రూపాయలు పందెంలో ఓడి పోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇండస్ట్రీలో అతడికి మంచి పేరు ఉంది.
ఏడాదికి పది పదిహేను సినిమాలు చేస్తూ రోజుకు రెండు మూడు లక్షల రూపాయల పారితోషికం అందుకునే ఆ నటుడు ఈమద్యే కాస్త జోరు పెంచి కమర్షియల్ గా హిట్స్ దక్కించుకుని ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.
ఇలాంటి సమయంలో కోడి పందెం లో పాతిక లక్షల రూపాయలను పోగొట్టుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడట.అతడి గురించి తెలిసిన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.అతడి తీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారట.అతడు మాత్రం ఎంజాయ్ చేసి ఇష్టానుసారంగా డబ్బులను వృదా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.అక్కడ డబ్బులు పది మందికి వస్తే వందమంది నష్టపోవాల్సి వస్తుంది.