టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ ఇప్పటి వరకు కేవలం తెలుగు భాషకి మాత్రమే పరిమితం అయ్యి సినిమాలు చేసేవారు.అప్పుడప్పుడు వారి సినిమాలు ఇతర భాషలలో డబ్బింగ్ అవుతూ ఉండేవి.
అయితే బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్టామినా దేశ వ్యాప్తంగా తెలిసింది.ఈ నేపధ్యంలో బాహుబలిని అనుసరిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగా ఉండేలా చూసుకుంటున్నాడు.
సాహోతో పాటు ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే.పాన్ ఇండియా మూవీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటంతో బడ్జెట్ పరిధులు కూడా పెంచుకొని, కాస్టింగ్ విషయంలో కూడా అన్ని భాషల ప్రేక్షకులకి చేరువ అయ్యే విధంగా చూసుకుంటున్నారు.
ప్రభాస్ ని అనుసరిస్తూ చిరంజీవి పాన్ ఇండియా మూవీగానే సైరా సినిమా రిలీజ్ చేశారు.ఇక సినిమాలో అమితాబచ్చన్ లాంటి స్టార్ నటుడు కూడా హిందీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.
అయితే ఇప్పుడు రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా సినిమానే తీస్తున్నాడు.ఇక పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండతో తీస్తున్న మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేశాడు.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.అన్ని భాషలలో తెలుగు స్టార్ హీరోలు ఇలా పాన్ ఇండియా పేరుతో సినిమాలు రిలీజ్ చేస్తూ వారి మార్కెట్ పరిధులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ ప్రయత్నం సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తాయి.అలా కాకుంటే మళ్ళీ దుకాణం సర్దుకొని కేవలం తెలుగుకి పరిమితం అయిపోవాల్సిందే.
అయితే యుట్యూబ్ లో సౌత్ మాస్ సినిమాలకి మంచి వ్యూస్ వస్తూ ఉండటంతో కరెక్ట్ గా ప్రమోషన్ చేసుకుంటే థియేటర్స్ లో కూడా సూపర్ హిట్ అవుతాయని మన స్టార్ హీరోలు భావించి తమ సినిమాలు అన్ని భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.