తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చి రానీ తెలుగుతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఆ మధ్య గుంటూరు టాకీస్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై స్పందించింది.
అయితే ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని కానీ ఆ కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. అంతేకాక ఎవరైనా దర్శకనిర్మాతలు లేదా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కమిట్ మెంట్లు అడిగిన సమయంలో తమకు ఇష్టం లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది.
ఒకవేళ ఇష్టం లేకపోయినప్పటికీ తమపై బలవంతంగా అత్యాచారయత్నం లేదా లొంగ తీసుకోవడం వంటివి చేస్తే ఫిలిం ఛాంబర్లో గాని లేదా పోలీసులకు గాని సమాచారం అందించి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పుకొచ్చింది.అంతేగాక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా కూడా ఉంచబడతాయని కూడా తెలిపింది.
అలాగే దాదాపుగా చిత్ర పరిశ్రమలో ఎవరూ కూడా కమిట్ మెంట్ అడిగిన సమయంలో నో చెబితే బలవంతం చేయరని కూడా స్పష్టం చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రష్మి గౌతమ్ పలు షోలు, ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బాగానే రాణిస్తోంది. మరోపక్క టాలీవుడ్ చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటూ తన అందాల ఆరబోతతో ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.కాగా తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఇటీవలే బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుదీర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఇటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ లేదా సుడిగాలి సుదీర్ గాని స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజం ఎంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.