టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంతో పలువురు ప్రముఖులు విచారణను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ కేసు విచారణ విషయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.ఇలాంటి సందర్భంలోనే ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారం హీరో రవితేజ సోదరుడు కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలే ఒక పబ్ లో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక వంటి వారు దొరకడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే వారు ఉన్న ఆ పబ్బు ఓ డ్రగ్స్ వాడుతున్న వాళ్లే ఆనవాళ్ళు ఉండటంతో ఈ విషయం మొన్నటి వరకు కూడా సంచలనం సృష్టించింది.
ఆ తరువాత సినీ పరిశ్రమ నుంచి కొంతమంది అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటూ ఈ విషయాన్ని ఖండించడంతో ఆ వార్తలకు అక్కడితో బ్రేకులు పడ్డాయి.అయితే ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
అది కూడా ఏకంగా 190 కేజీల గంజాయితో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న హాథిరాం అనే వ్యక్తి పట్టుబడ్డాడు.ఇతను యుద్ధం శరణం, కురుక్షేత్రం ఇలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.అంతేకాకుండా ఇతనికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.అయితే పోలీసుల విచారణలో అతడు టాలీవుడ్ లోని పలువురు సినీ ఆర్టిస్టులకు గంజాయి సప్లై చేస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
దీనితో అతనితో పాటు మరొక ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.అయితే అతని వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు భావిస్తున్న సినీ ఆర్టిస్ట్ లలో టెన్షన్ మొదలైంది.
పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.