బుల్లితెర యాంకర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి యాంకర్ ఝాన్సీ ఇంట్లో కూడా విషాదం నింపింది.
కరోనా బారిన పడి ఝాన్సీ పిన్ని భవానీ చనిపోయారు.ఝాన్సీకి ఎంతో ఇష్టమైన పిన్ని చనిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.
తన పిన్ని మరణం గురించి ఝాన్సీ కీలక వ్యాఖ్యలు చేశారు.
పిన్ని ఎల్లప్పుడూ నవ్వుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉండేదని.
ప్రేమతో ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేదని.దేవునిపై పిన్నికి ఎంతో భక్తి ఉందని చెప్పారు.
ఎప్పుడూ దైవ చింతనలో గడిపే పిన్నికి త్వరగా దేవుడు ముక్తిని ప్రసాదించాడని చెప్పుకొచ్చారు.పిన్ని తనకు ఒక మంచి ఫ్రెండ్ లా ఉండేదని.
ఎప్పుడూ హుషారుగా కనిపించేదని అన్నారు.ఇతరులకు ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేయడంలో పిన్ని ముందుండేవారని చెప్పారు.
ఆమె గురించి తెలిసిన వారు కూడా ఆమె ఎనర్జీని ఫీల్ అవుతారని.తమ కుటుంబానికి ఆమె ఎంతో బలంగా నిలిచిందని అన్నారు.ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతున్నామంటే దానికి పిన్ని ఇచ్చిన స్పిరిట్ కారణమని తెలిపారు.పిన్నిని మిస్ అవుతున్నామని.ఎల్లప్పుడూ సన్నిహితంగా చలాకీగా ఉంటుందని అన్నారు.తన పాప పిన్నిని భవాని అనకుండా బబ్బా అని పిలిచేదని అదే పిన్ని నిక్ నేమ్ అని చెప్పారు.
పాప నిక్ పేమ్ పెట్టడం వల్ల అందరం భవానికి బదులుగా బబ్బా అని పిలిచే వాళ్లమని.ఐ హేట్ కరోనా అంటూ ఝాన్సీ బాధ పడుతూ పిన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.
కరోనా బారిన పడిన భవాని ఈ నెల 4వ తేదీన వైరస్ నుంచి కోలుకోలేక చనిపోయారు.కరోనా వైరస్ సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది.