పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.అందులో ఇప్పటికే ఆయన 26వ చిత్రం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అయ్యింది.
విడుదలకు కూడా రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.షూటింగ్ పూర్తి అయినా కూడా కరోనా నేపథ్యంలో కాస్త ఆలస్యంగానే సినిమాను విడుదల చేయాలని దిల్రాజు భావిస్తున్నాడు.
ఇక పవన్ 27వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొంటాడు అనుకుంటూ ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ను విధించడంతో షూటింగ్కు అంతరాయం ఏర్పడినది.ఈ సమయంలోనే పవన్ చిత్రం కోసం దర్శకుడు క్రిష్ హీరోయిన్స్ వేటలో పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో కథానుసారంగా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఒక హీరోయిన్ పవన్కు జోడీగా నటించనుండగా మరో హీరోయిన్ దొంగల ముఠా నాయకురాలిగా కనిపించబోతుందట.
దొంగల ముఠా నాయకురాలి పాత్రలో అనుష్క నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.పవన్, అనుష్కల కాంబోలో ఒకటి రెండు దొంగతనాల సీన్స్ ఉంటాయని, అవి చాలా బాగుంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు.
దర్శకుడు క్రిష్ పాత్రలను తీర్చి దిద్దడంలో దిట్ట.అందుకే ఈ రెండు పాత్రలను అద్బుతంగా చూపించబోతున్నాడట.
అనుష్కను గతంలో క్రిష్ సరోజా పాత్రలో వేదం సినిమాలో చూపించాడు.మళ్లీ అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అనుష్కను చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.