తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చిన చాలామంది మంచి గుర్తింపు సాధించి వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుని సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు.కొందరు మాత్రం తక్కువ సినిమాలకు పరిమితమై ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
ఏదేమైనా హీరోయిన్ల సినిమా కెరియర్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది అని చెప్పాలి.అయితే కొంతమంది మోడలింగ్ ద్వారా సినిమా హీరోయిన్ గా వస్తే, మరి కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా హీరోయిన్స్ గా వస్తున్నారు.కొందరు టీవీ లో యాంకర్ గా చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు అలా వచ్చిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రెజీనా
రెజీనా మొదట్లో ఒక షో కి యాంకర్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.సూపర్ స్టార్ కృష్ణ అల్లుడైన సుధీర్ బాబు హీరోగా పరిచయం అయిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా లో హీరోయిన్ గా నటించి తన నటన ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించి శభాష్ అనిపించుకుంది.
నిహారిక
మెగా బ్రదర్ అయిన నాగబాబు కూతురు గా ముందుగా ఈటీవీలో ప్రసారమైన డి ప్రోగ్రాం కి యాంకర్ గా చేసి ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సాధించింది.ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు దాంతో నిహారికకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.ప్రస్తుతం ఆవిడ చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
అనసూయ
ఈటివి లో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాం తో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరించింది.నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి బుల్లితెర మీదే కాదు, వెండితెర మీద కూడా మంచి గుర్తింపు సాధించింది.
ఆ సినిమా తర్వాత అడవి శేషు ప్రధాన పాత్ర పోషించిన క్షణం సినిమాల్లో కూడా నటించి నటిగా ఇంకో మెట్టు పైకి వెళ్ళింది.అలాగే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా నటించి మంచి గుర్తింపు సాధించింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
కలర్స్ స్వాతి
స్వాతి మాటీవీ లో వచ్చిన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయం అయింది.ఈ ప్రోగ్రామ్ తో మంచి గుర్తింపు సాధించిన స్వాతి కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన అష్టాచమ్మ సినిమాలో హీరోయిన్ గా నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తరువాత నిఖిల్ హీరోగా వచ్చిన స్వామిరారా సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.మళ్లీ నిఖిల్ తో చేసిన కార్తికేయ సినిమాతో ఇంకో హిట్ అందుకొని ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
రష్మి
రష్మి మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేయడంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.అలాగే గుంటూరు టాకీస్ లాంటి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతూ బుల్లితెరపై కూడా ఈవెంట్లు,ప్రోగ్రాములు చేస్తూ తన డైరీ ఖాళీ లేకుండా చూసుకుంటుంది.