తాజాగా నెటిజన్లు చేయనటువంటి పనికి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ మండిపడ్డారు.అయితే అందుకు కారణం లేకపోలేదు.
తాజాగా ఈ అమ్మడు గాయపడినటువంటి రెండు కుక్కపిల్లలని ఎవరైనా దత్తత తీసుకుంటారా అని ఒక ఫోన్ నెంబర్ ని మరియు కుక్క పిల్లల ఫోటోలు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు అది రష్మి ఫోన్ నెంబర్ అనుకొని ఫోన్లు చేస్తూ నా ఫోన్ నెంబర్ కలిగినటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారట.
దీంతో అతడు వెంటనే యాంకర్ రష్మీ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పుకోలేని బాధ పడ్డాడట.
దీంతో తాజాగా యాంకర్ రష్మీ ఈ విషయంపై స్పందించింది.
ఇందులో భాగంగా సెలబ్రిటీలతో మాట్లాడాలని అందరికీ ఉంటుంది కానీ వారితో మాట్లాడి నెపంతో ఇలా వేరే వాళ్ళని హింసించకూడదని అంటుంది ఈ అమ్మడు.అయితే గాయపడినటువంటి మూగజీవాలను ఎవరైనా దత్తత తీసుకుంటారా అనే నెపంతో మాత్రమే ధ్రువ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ని పోస్ట్ చేశానని కానీ తను అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి నెటిజన్లను పై మండి పడుతోంది.
ధ్రువ ఒక మంచి పని నిమిత్తం తన నెంబర్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడని అందువల్లనే ఆ నెంబర్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా నేను షేర్ చేశానని అంతేగాని తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ని ట్విట్టర్లో షేర్ చేయలేదని, అయినా తన వ్యక్తి గత ఫోన్ నెంబర్ ని ఇలా బహిరంగంగా ఎందుకు పోస్ట్ చేస్తానని కాస్త కామన్సెన్స్ వాడాలని నెటిజన్లకు సూచించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రష్మి గౌతమ్ ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే వంటి డి మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అంతే గాక ప్రస్తుతం రష్మీ పలు రకాల ఈవెంట్ను మరియు సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతోంది.అయితే మూగజీవాలకి సహాయం చేయాలనుకునే వారికి మనం తిరిగి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని వాపోతోంది ఈ అమ్మడు.