ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఉదయభాను.తన మాటలతో అందరినీ ఆకట్టుకునేది.ఎంతో గలగలా మాట్లాడుతూ ప్రేక్షకులనుండి మంచి గుర్తింపు పొందింది.అంతేకాకుండా ఈమె కొన్ని తన వ్యక్తిగత విషయాల పట్ల వార్తల్లో కూడా నిలిచింది.కొన్ని సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి బాగా మెప్పించింది.
బుల్లి తెరపై కాకుండా వెండితెర లో కూడా మెరిసింది.
ఈమె మొదటిసారి ఎర్ర సైన్యం సినిమాల్లో నటించింది.అంతేకాకుండా 2010లో విడుదలైన లీడర్ సినిమాలో కూడా నటించింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలలో మెప్పించి.బుల్లితెర లో ప్రసారమైన కొన్ని సీరియల్ లలో, కార్యక్రమాలలో చేసింది.
జానపద గేయాలు అందించే రేలా రే రేలా కార్యక్రమంలో తన యాంకరింగ్ తో, తన కట్టుబొట్టు తో బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా చిన్న పిల్లలతో కలిసి పిల్లలు పిడుగులు ప్రోగ్రాం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఓ షో లో పాల్గొన్న ఉదయభాను ఎమోషనల్ గా ఫీల్ అయిందట.
తన నటనకు, యాంకరింగ్ జీవితానికి సెలవు పెట్టి చాలా రోజులు కాగా.ఈమధ్య సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా అవుతుంది.తనకు సంబంధించిన విషయాల గురించి బయట జరుగుతున్న అఘాయిత్యాలు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది.
జీ తెలుగులో తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్ కార్యక్రమం ప్రసారం కానుంది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో లో మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ అనే ప్రోగ్రాంను చేస్తున్నారు ఇందులో మహిళల గురించి తెలుపుతూ వారికి సన్మానాలు చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో గెస్ట్ గా ఉదయభాను రాగా ఆమె ఆ కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు బాగా ఆకట్టుకున్నాయి.ఈ ప్లానెట్ కు చెట్టు ఎంత అవసరమో.
మహిళలను గౌరవించడం కూడా అంతే అవసరం అంటూ అందరి హృదయాలను ఎమోషనల్ చేసింది.