ఒకప్పుడు తన తరం శృంగార భరిత చిత్రాలతో స్టార్ హీరోల కంటే ఎక్కువ ఇమేజ్ ని సంపాదించుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్న “సీనియర్ నటి షకీలా” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఆ మధ్య కాలంలో నటి షకీలా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా తెలుగు సినిమా పరిశ్రమలో తన మిత్రుల గురించి పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో తనకు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ మరియు హీరో ఆలీ, ప్రముఖ స్వర్గీయ హాస్యనటుడు వేణుమాధవ్ తనకు మంచి మిత్రులని తెలిపింది అలాగే కమెడియన్ వేణు మాధవ్ తో జరిగినటువంటి ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో ఓ సినిమా షూటింగ్ నిమిత్తమై తాను మరియు వేణుమాధవ్ అలాగే మరికొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు ఒకే హోటల్ లో బస చేశామని తెలిపింది.అయితే ఆ రోజు రాత్రి తాను వేణు మాధవ్ కలిసి ఒకే రూమ్ లో పడుకున్నామని దాంతో వేణు మాధవ్ తనతో ఎదో చెప్పాలని ఉందని అనడంతో కొంతమేర టెన్షన్ పడ్డానని తెలిపింది.
కానీ, వేణు మాధవ్ మాత్రం పరుపు కి మధ్యలో తలగడలను అడ్డం ఉంచుతూ అర్ధరాత్రి సమయంలో తనని లేపి నాకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని కాబట్టి అర్ధ రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన కాలుని తనపై వేస్తే తాను పుటుక్కుమంటానని వేణు మాధవ్ కామెడీ చేశాడని ఇప్పటికీ ఆ సంఘటన తనకు చాలా బాగా గుర్తుందని తెలిపింది.అంతేకాక ఒకానొక సమయంలో వేణుమాధవ్ తనకి అప్పుడప్పుడు ఫోన్ చేసి తన యోగక్షేమాల గురించి కూడా తెలుసుకునే వాడిని అంత మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని కొంతమేర ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత తనకి రాజకీయాల్లోకి రావాలని ఉందని తన మనసులో మాటని బయట పెట్టింది. అంతేగాక ప్రస్తుతం తాను కొన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.