తెలుగులో ప్రముఖ దర్శకుడు ఇ.సత్తి బాబు దర్శకత్వంలో నటించిన “యముడికి మొగుడు” అనే చిత్రంలో యముడి కూతురు హిమజ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినటువంటి “బాలీవుడ్ బ్యూటీ రీచా పనయ్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన అందం, అభినయంతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో కొత్త సినీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయింది. దీంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.
అయితే తెలుగులో రిచా పనయ్ చంద మామ కథలు, మనసున మాయ సేయకే, లవ కుశ (గెస్ట్ రోల్), రక్షక భటుడు తదితర చిత్రాలలో నటించింది.కాగా ఇందులో చందమామ కథలు, యముడికి మొగుడు చిత్రాలు తప్ప ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో ఈ అమ్మడు చేసేదేమి లేక బాలీవుడ్ కి చెక్కేసింది.కానీ అక్కడ కూడా సినిమా అవకాశాలు దక్కించుకుని తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రిచా పనయ్ మలయాళం భాషలో “నయట్టు” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ఇటీవలే “సెకండ్ ఇన్నింగ్స్” అనే మరో మలయాళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ ఒకటి లేదా రెండు టాలీవుడ్ సినిమాలు చేసి బాలీవుడ్ సినీ పరిశ్రమపై మనసు పారేసుకుని చేతులు కాల్చుకున్న హీరోయిన్ల లిస్టులో చేరిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.