టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన
ఉయ్యాల జంపాల
చిత్రంలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలి పాత్రలో నటించినటువంటి తెలుగు భామ
పునర్నవి భూపాలం
గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తాజాగా దేశంలో కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో పలువురు సినీ స్టార్లు మరియు సామాన్య ప్రజలు ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లకే పరిమితమయ్యారు.
అయితే పునర్నవి భూపాలం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరిస్తూ తాను ఉన్నటువంటి ఇంటికే పరిమితమైంది.అయితే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పునర్ణవి భూపాలం పలు రకాల యోగ ఆసనాలు వేస్తూ ప్రజలకి ఆరోగ్య సంబంధిత టిప్స్ అందిస్తోంది.
అంతేగాక ఈ ఆసనాలు వేసే సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలని ఇటీవలే పునర్నవి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలు షేర్ చేసింది.దీంతో నెటిజన్లు ఆమె చేస్తున్నటువంటి ఈ పనికి ఫిదా అయ్యారు.అంతేగాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే టువంటి యోగ గురించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం అందరికీ ఉపయోగపడే అంశమని కీప్ ఇట్ అప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో పునర్ణవి భూపాలం
“ఒక చిన్న విరామం తర్వాత”
అనే చిత్రంలో నటించింది.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అయితే ప్రస్తుతం
“సైకిల్”
అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అర్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోగా
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మూవీ ఫేమ్ మహత్ రాఘవేంద్ర
హీరోగా నటిస్తున్నాడు.