ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన టువంటి “ఊసరవెల్లి” అనే చిత్రంలో హీరోయిన్ తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పాయల్ ఘోష్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతోంది.
ఇటీవలే తాను ఓ సినిమా అవకాశం విషయమై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని కలిసేందుకు వెళ్లగా అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడని ఆ మధ్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక అప్పటినుంచి పాయల్ ఘోష్ ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా తాజాగా పాయల్ ఘోష్ తాను అనురాగ్ కశ్యప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటివరకు ముంబై పోలీసులు అనురాగ్ కశ్యప్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అంతేకాక అతడు సెలబ్రిటీ హోదా లో ఉన్నాడు కాబట్టే పోలీసులు అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అలాగే “నేను చస్తే గాని నాకు న్యాయం చేయరా…?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాయల్ ఘోష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోదుమారం రేపుతున్నాయి.
దీంతో పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై చేసినటువంటి ఆరోపణలలో నిజం లేదని కొందరు సినీ సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. అంతే గాక ఈ మధ్య కాలంలో పాపులర్ కావాలని కొందరు చేసేటటువంటి పనులు సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాయని కాబట్టి సాక్ష్యాధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే వారిని గుర్తించి కఠిన శిక్షించాలని కోరుతున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్ కి పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. అంతేగాక తాము ఎంతో కాలంగా పని చేస్తున్నామని ఇప్పటి వరకు తడినుంచి ఎలాంటి లైంగిక వేధింపులు గానీ లేదా ఇతర సమస్యలు గానీ ఎదుర్కోలేదని చెబుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పాయల్ ఘోష్ ప్రముఖ దర్శకుడు “అమీన్ హాజీ” దర్శకత్వం వహిస్తున్న “కోయి జానే నా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా క్రునాల్ కపూర్ మరియు అమైరా దస్తూర్ లు నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.