స్టార్ హీరోయిన్ కాజల్ ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.కాజల్ గౌతమ్ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ప్రేమ వివాహమని వీళ్ల పెళ్లికి ముందే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ వెల్లడించారు.
కాజల్ ప్రేమ కథ గురించి పెళ్లి తర్వాత ఆమెనే స్వయంగా చెబుతారని అన్నారు.గత నెల 30వ తేదీన కాజల్ గౌతమ్ ల వివాహ వేడుక ఘనంగా జరగగా కాజల్ తన ప్రేమ కథను బయటపెట్టారు.
గౌతమ్ తో తనకు పది సంవత్సరాల నుంచి పరిచయం ఏడేళ్ల నుంచి ఒకరికొకరం మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.కాలక్రమేణా స్నేహం కాస్తా ప్రేమగా మారిందని మూడు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నామని ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు.
పదేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడిందని.కరోనా వల్ల కొన్ని నెలల పాటు ఒకరినొకరు కలవడం కురదలేదని ఆ సమయంలో ఒకరిపై ఉన్న ప్రేమ మరొకరికి అర్థమైందని అన్నారు.
ఇరు కుటుంబాలు తమ పెళ్లికి అంగీకరించాయని.జూన్ నెలలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య నిశ్చితార్థ వేడుక జరిగిందని తెలిపారు.
ఆన్ లైన్ లోనే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ద్వారా డ్రెస్ లను ఫిక్స్ చేశామని.కరోనా వల్ల చాలా పనులను ఆన్ లైన్ లోనే పూర్తి చేశామని తెలిపారు.
సినిమాల తరహాలో గౌతమ్ తనకు ప్రపోజ్ చేయకపోయినా చాలా ఎమోషనల్ గా ప్రేమను వ్యక్తం చేశాడని అన్నారు.
తనపై ఉన్న ప్రేమను మాటల్లో వెల్లడించాడని.
ఇద్దరం కలిసి భవిష్యత్తు గురించి ఎక్కువగా చర్చించుకున్నామని తెలిపారు.సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కాజల్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించనున్నారు.
ప్రస్తుతం కాజల్ చేతిలో ఆచార్య, భారతీయుడు 2 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.