సుహాస్చాందినీ చౌదరి కలసి జంటగా నటించిన చిత్రం కలర్ ఫోటో చిత్రం నలుపు రంగు అబ్బాయి, తెలుపు రంగు అమ్మాయి మధ్య జడ్పీ ప్రేమకథ నేపథ్యంలో సందీప్ రాజ్ దర్శకత్వం నిర్వహించగా, అమృతా ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఈ చిత్రంలో నటించిన సుహాస్చాందినీ చౌదరి నటన ఎంతోమందిని ఆకర్షించింది.
ఈ చిత్రం గురించి దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్ కోసం మొదటగా మెగా డాటర్ నిహారికను సంప్రదించాలని ఆలోచనల్లో ఉండగా…ఈ సినిమాలో సుహాస్ లీడ్ రోల్ చేయడంతో ఆలోచనలో పడ్డామని దర్శకుడు తెలియజేశారు.దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో చాందిని చౌదరినీ ఫైనల్ చేశారని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంలో చాందిని చౌదరి తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుందని దర్శకుడు తెలియజేశారు.
సినిమాలలోకి రాకముందు చాందినీ చౌదరి కాలేజీ రోజుల్లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన చాందినీ చౌదరి, వెండితెరపై ఇద్దరూ కలిసి నటించక పోవడం గమనార్హం.2013వ సంవత్సరంలో వచ్చిన “మధురం”అనే షార్ట్ ఫిలింలో చాందిని ని చూసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం 2015 లో జరిగింది.2015 సంవత్సరంలో అప్పటికి కేటుగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తరువాత 2018 వ సంవత్సరం లో నటించిన మను చిత్రంలో నటించిన నీలా పాత్రకు ప్రశంశలు అందుకుంది.
తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలలో నటించింది.