సినిమా రంగం అనేది ఓ మాయ.అందులో బయటకు కనిపించేవి వేరు.
లోపల జరిగేవి వేరు.ఎవరు ఎవరితో కలిసి ఉంటారో? ఎప్పుడు విడిపోతారో? ఎవరికీ తెలియదు.ఎంతో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న వారు సైతం అకస్మాత్తుగా విడిపోతున్నారు.కారణాలు ఏంటో తెలియదు కానీ.సినిమా పరిశ్రమలో విడాకుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య, సమంతా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు.
ఈ నిర్ణయంతో అంతా షాక్ కు గురయ్యారు.మరికొద్ది రోజులకే సుష్మితా సేన్, రోహ్మాన్ కూడా మూడు ముళ్ల బంధానికి మంగళం పాడారు.
అటు అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా ఇద్దరూ బై చెప్పుకున్నారు.తాజాగా ఇదే లిస్టులో చేరారు కోలీవుడ్ జంట ధనుష్, ఐశ్వర్య.
ఎలాంటి చడీ చప్పుడు లేకుండా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.సుమారు 18 ఏండ్ల పాటు వీరిద్దరు కలిసి ఉన్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా.ఈ నేపథ్యంలో వారు ఎందుకు విడిపోవాలి అనుకున్నారో కానీ.
చాలా మందికి అంతుపట్టడం లేదు.
వీరి విషయం అటుంచితే చిరంజీవి చిన్న కూతురు కూడా తన భర్తతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కల్యాణ్ దేవ్ తో తనకు గొడవలు అవుతున్నట్లు సమాచారం.
అందుకు ఈమె సోషల్ మీడియాలో తన ఇంటిపేరును మార్చుకుందట.ఈ నేపథ్యంలో విడాకులు వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.గడిచిన కొంత కాలంగా వీరిద్దరు వేర్వేరుగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
అటు ఈయన నటిస్తున్న తాజా సినిమాల విషయంలోనూ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు.శ్రీజ పేరు మార్చుకోవడమే కాదు.
ఇన్ స్టా లోని తన ఫోటోలను కూడా డిలేట్ చేస్తుంది.
అటు టాలీవుడ్ నుంచి మరో యంగ్ హీరో కూడా విడాకులకు సిద్ధం అవుతున్నాడట.అటు మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కూడా హీరోయిన్లతో ఎఫైర్ల కారణంగా భార్యలతో విడిపోతున్నట్లు తెలుస్తోంది.ఓ స్టార్ డైరెక్టర్ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు.
అయితే తన సినిమాల్లో ఓ హీరోయిన్ ను పదే పదే చూపిస్తుంది.ఈ నేపథ్యంలో ఆ దర్శకుడి తీరుపై ఆయన భార్య కోపంగా ఉందట.
తనతో ఇక పడలేను అని భావించి విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.మరో స్టార్ డైరెక్టర్ కూడా తన భార్య నుంచి విడిపోతున్నట్లు తెలుస్తోంది.