సినీ పరిశ్రమలో కొన్ని కథలు ఓ హీరో కోసం రాసుకుంటే ఆ కధ మరో హీరో కి పోతుంది.అంతేకాకుండా ఓ సినిమాలో ఒక హీరోయిన్ ని ఎంచుకుంటే మరో హీరోయిన్ వచ్చి చేరుతుంది.
అలా కొన్ని కొన్ని సందర్భాలలో జరుగుతుంటాయి.అంతేకాకుండా హీరో సినిమా కోసం ఎంచుకున్న టైటిల్ ను కూడా మరో హీరో సినిమా కోసం కూడా మారుతుంది.
ఇలాగే స్టార్ హీరో మహేష్ బాబు ఉ సినిమా టైటిల్ తో మరో స్టార్ హీరో ప్రభాస్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.
పదేళ్ల కింద రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా.ఈ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.ఇందులో ప్రభాస్ మంచి క్లాస్ హీరోగా కనిపించాడు.
అప్పట్లో ఈ సినిమాకు 30 కోట్ల వరకు వసూలు కూడా అందగా.దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కు మాత్రం ఆసక్తికరమైన కథ ఉంది.
ఈ సినిమాను టైటిల్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి తో కలిసి మహేష్ బాబు చేయడానికి సిద్ధమయ్యాడు.అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ కూడా నటించేనుండే.ఇదివరకే మహేష్ బాబు ఖలేజా సినిమాలో బిజీగా ఉండగా ఆ సినిమా తర్వాత సెట్స్ మీదకి వెళ్లడానికి సిద్ధం అయ్యారు.
కానీ ఈ సినిమాను ఆర్.ఆర్.మూవీ మేకర్స్ రిజిస్టర్ చేసుకోగా.ఈ సంస్థకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీంతో ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.ఈ సినిమా కోసం మహేష్ బాబు కు 2.5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
ఇక ఈ సినిమా ఆగిపోవడంతో మహేష్ బాబు అడ్వాన్స్ కాస్త వెనుకకు ఇచ్చేశాడు.
ఇలా ఈ సినిమా ఆగిపోయినందున.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కు ప్రభాస్ ఫోన్ చేసి టైటిల్ ను తీసుకున్నాడట.దీంతో మిస్టర్ పర్ ఫెక్ట్ మహేష్ బాబు నుండి ప్రభాస్ కి మారింది.ఇక మిస్టర్ పర్ ఫెక్ట్ ను మహేష్ సొంతం చేసుకోనందున రెండేళ్ల తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ మహేష్ కు మాట ఇచ్చినందున మహేష్ బాబుతో మరో సినిమాను చేయించారు.ఆ సినిమా ఏదో కాదు బిజినెస్ మాన్.ఇక ఈ సినిమా మహేష్ బాబుకు మంచి విజయాన్ని అందించగా.సురేందర్ రెడ్డి రాసుకున్న మహేష్ బాబు మిస్టర్ పర్ ఫెక్ట్ కథ ఇప్పటికీ అలాగే ఉందట.మరి ఈసారైనా ఆ కథ తెరపైకి వస్తుందో రాదో చూడాలి.