మొదట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షోలో నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయం అయినటువంటి “రంగస్థలం మహేష్” గురించి తెలియని వారుండరు.ఇతడు టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో హీరో స్నేహితుడి పాత్రలు అలాగే పలు కామెడీ సన్నివేశాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా మహేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన సినీ జీవితానికి సంబంధించినటువంటి పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో తాను సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాలా కాలం పాటు ఎదురు చూశానని, అంతేగాక రోజూ ప్రముఖ దర్శకుల ఇళ్ల చుట్టూ అవకాశాల కోసం తిరిగే వాడినని చెప్పుకొచ్చాడు.అయితే అప్పట్లో తన వద్ద కనీసం బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు ఉండేవి కావని దాంతో ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడినని తెలిపాడు.
అలాగే ఒకానొక సమయంలో తన దగ్గర భోజనం చేయడానికి డబ్బులు లేకపోతే అప్పుడుప్పుడు సాయిబాబా గుడిలోకి వెళ్లి తినేవాడిని అని చెప్పుకొచ్చాడు.
అయితే ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయని కానీ తన జీవితంలో తన తండ్రి మరణించిన ఘటన ఎంతగానో కలిచివేసిందని ఎమోషనల్ అయ్యాడు.
అంతేగాక తన తండ్రి మరణించిన సమయంలో తాను హైదరాబాదులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని, తన తండ్రి మరణ వార్త విన్నప్పటికీ చూసేందుకు వెళ్లడానికి కూడా ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేవని, కానీ సినీ పరిశ్రమలో తన స్నేహితులకి తెలిసినటువంటి ఓ వ్యక్తి డబ్బు సాయం చేశాడని చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పటివరకు మహేష్ ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, మహానటి తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో ఆర్ఎక్స్ 100 చిత్ర ఫేమ్ కార్తికేయ హీరోగా నటించినటువంటి “గుణ 369” అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.దీంతో టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడినటువంటి మహేష్ ఆచంట ప్రస్తుతం వరుస అవకాశాలతో చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.