వాహనదారుల జేబులకు చిల్లుపడే మరో అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది.రావడమే కాదు అమలు కూడా అవుతుంది.
ఇప్పటికే టోల్ టాక్సీ పేరుతో జరుగుతున్న దందా గురించి తెలిసిందే.కాగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలలో పలు మార్పులు జరిగాయి.
ఇప్పటి వరకు వసూల్ చేస్తున్న టోల్ చార్జీలను 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్జీసీఎల్ నిర్ణయం తీసుకుంది.తాజా పెంపుతో ఔటర్ రింగు రోడ్డు ద్వారా ప్రయాణించే వాహనాలపై ప్రతి కి.మీ.కు కనీసం ఆరు పైసల నుంచి 39 పైసల మేర టోల్ చార్జీ వసూలు చేయడం జరుగుతుందని సమాచారం.
ఇకపోతే ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ప్రతియేటా జీవో నం.365 క్లాజ్ 5 ప్రకారం నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు టోల్ రూల్స్ 2012 ను అనుసరించి ప్రతియేటా యూజర్ చార్జీలను పెంచేందుకు అవకాశం ఉంది.కాబట్టి ప్రస్తుతం ఈ జీవో ప్రకారం టోల్ చార్జీలు పెంచినట్లుగా తెలుస్తుంది.
కాగా పెరిగిన టోల్ చార్జీలు ఇప్పటికే అమలులోకి వచ్చాయట.