ఒలింపిక్స్ లో భారత్ కు పసిడి పతకాన్ని తెచ్చాడు నీరజ్ చోప్రా.టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్స్ లో చోప్రా విసిరిన త్రో 87.58 మీటర్లతో ఇండియాకు స్వర్ణ పతకాన్ని తెచ్చి పెట్టింది.పసిడి పతకాన్ని తెచ్చిన యువ అత్లెట్ పై రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ స్పందిస్తూ నువ్వు విసిరిన జావెలిన్ హద్దుని బద్ధలు కొడుతూ చరిత్ర సృష్టించిందని అన్నారు.
తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొని ట్రాక్ అండ్ ఈల్డ్ లో మొదటి పతకాన్ని సాధించావి.నీ ప్రదర్శన దేశ యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ప్రధాని మోడీ కూడా చోప్రా ప్రదర్శనపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభినందనలు తెలియచేశారు.టోక్యోలో చరిత్ర లిఖితమైందని అన్నారు.
నీరజ్ చోప్రా సాధించిన విజయం ఎప్పటికి గుర్తుండి పోతుందని అన్నారు.కుర్రవాడైన నీరజ్ చోప్రా నిజంగా అదరగొట్టాడని అన్నారు.
ఆట పట్ల తపన, తిరుగులేని దృడ సంకల్పం చూపించాడని అనారు.పసిడి పతకం సాధించిన అతనికి శుభాభివందనాలు తెలిపారు మోడీ.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇది ఒక అద్భుతమైన ఘటన అని ఆనందం వ్యక్తం చేశారు.నీరజ్ చోప్రా దేశానికి వన్నె తెచ్చాడని అన్నారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో స్వర్ణం లేక సుధీర్ఘ కాలం భారత్ అలంటిస్తుందని.ఇన్నేళ్ల నిరీక్షణకు నీరజ్ చోప్రా తెరదించాడని వెంకయ్య నాయుడు అన్నారు.