ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఉత్కంఠ వీడుతోంది.ఇప్పటికే ఆయన కరోనాను జయించిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు అంటూ చరణ్ ఇటీవలే పేర్కొన్నారు.కొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తులు ఏమాత్రం సరిగా లేని కారణంగా ఆయనకు మరికొన్ని రోజులు వెంటి లేటర్ ద్వారా శ్వాస అందించాలని భావిస్తున్నారు అంటూ చరణ్ ఇటీవలే పేర్కొన్నాడు.
తాజాగా మరోసారి చరణ్ తన తండ్రి ఆరోగ్యం గురించి ఒక వీడియోను షేర్ చేసి అందరికి గుడ్ న్యూస్ చెప్పాడు.గత నాలుగు రోజులుగా నాన్న గారి ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఇప్పుడు ఆయనకు ఓరల్ ఫీడింగ్ కూడా ఇస్తున్నట్లుగా పేర్కొన్నాడు.గత నెల రోజులుగా ఆయనకు ఆహారంగా కేవలం మెడిసిన్స్ మాత్రమే ఇస్తూ వచ్చారు.ఎట్టకేలకు ఆయనకు ఓరల్ ఫీడింగ్ పెడుతున్నట్లుగా చరణ్ పేర్కొనడంతో ఆయన ఆరోగ్యం మరింత కుదుట పడ్డట్లుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో బాలు మరింత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు మరియు ఇతరులు కోరుకుంటున్నారు.ఆయన మాటలను బట్టి చూస్తుంటే మరో రెండు మూడు వారాల్లో బాలు గారు మళ్లీ పాటలు పాడేందుకు స్టేజ్ ఎక్కే అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది.
రెండు మూడు వారాలు కాకున్నా రెండు మూడు నెలల తర్వాత అయినా బాలు మళ్లీ స్టేజ్ ఎక్కడం ఖాయం అంటూ చాలా మంది నమ్మకంగా ఉన్నారు.బాలు ఆరోగ్యం కుదుట పడాలంటూ వేలాది మంది ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఎన్నో విధాలుగా ప్రార్థనలు చేశారు.
వారి ప్రార్థనలు ఫలించి బాలు ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా నెట్టింట చర్చ జరుగుతోంది.