హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది.ఈ సమావేశానికి మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 33 జిల్లాల పార్టీల అధ్యక్షులతో పాటు మొత్తం 283 మంది హాజరుకానున్నారు.
నేడు జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో ముందుగా ఈ సమావేశంలో పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారు.