2020 లో కరోనా కారణంగ అన్నీ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే.గడిచిన ఏడాది పరీక్షలు లేకుండానే పై తరగతులకు ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు విధ్యా శాఖ అధికారులతో సమావేశమై ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్ ల ద్వారా విద్యార్థులకు బోదిస్తున్నాయి.కరోనా కు వ్యాక్సిన్ వస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది.
నేడు ప్రత్యక్ష తరగతుల బోధన పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యాసంస్థల అధికారులతో, జిల్లా కలెక్టర్ లతో సమావేశం అవ్వనున్నాడు.ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది.
ముందుగా తొమ్మిది, పది తరగతులను తెరవలని విద్యాశాఖ ప్రభుత్వంకు అందించిన తమ ప్రతిపాదనలో పొందుపరిచింది.ఈ నివేధికపై కేసిఆర్ తుది నిర్ణయం తీసుకొనున్నాడు.
టెట్ పరీక్ష విధానంలో మార్పులపై కేసిఆర్ సమీక్షించనున్నాడు.