ఏపీలో మూడు రాజధానులు చేయాల్సిందే అన్న దృఢ నిశ్చయంతో వైసిపి అధినేత, ఏపీ సీఎం ఉన్నారు.ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అడ్డుపడుతూ పూర్తిస్థాయి రాజధాని అమరావతి లోనే ఉండాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉంది.
కేంద్ర అధికార పార్టీ బిజెపి కూడా రాజధానిగా అమరావతి ఉండాలంటూ పట్టుబడుతోంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం తాము అమరావతి విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోమని, అసలు రాజధాని అనేది రాష్ట్రపతి పరిధిలోని అంశమని, దీనిలో కేంద్రం జోక్యం ఉండదు ఉండదు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెబుతున్నారు.
అయితే ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం ఏపీకి పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి ఉండాలంటూ తన నిర్ణయాన్ని పార్టీ నిర్ణయం గా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ కేంద్ర బిజెపి పెద్దలను కలిసేందుకు నేడు ఢిల్లీకి పయనం అవుతుండడం ఆసక్తి రేపుతోంది.ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవబోతున్నట్టు సమాచారం.ఇప్పటికే సీఎం కార్యాలయం అమిత్షా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
అపాయింట్ మెంట్ రాగానే అమిత్ షాతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ఏపీ రాజకీయాల గురించి పూర్తిస్థాయిలో చర్చిస్తారట.దీని కారణంగా మూడు రాజధానుల విషయంలో ఈ రోజు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.
ఈ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.అయితే జగన్ ఢిల్లీ పర్యటన పై ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా ఆరా తీస్తోంది.
ఒకవేళ అపాయింట్మెంట్ దొరికి అమిత్ షాతో జగన్ భేటీ అయితే ఏ అంశాల గురించి మాట్లాడుతారు అనే విషయంపై ఆరా తీస్తోంది.రెండు రోజుల క్రితమే జనసేన, బిజెపి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జగన్ ఇంత అకస్మాత్తుగా బీజేపీ పెద్దలను కలవడం వెనుక ఆంతర్యం ఏంటో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.జగన్ కూడా జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపధ్యాన్ని ప్రస్తావించి ఆ తరువాత ఏపీలో బీజేపీ విషయంలో ఏ స్టాండ్ తో ఉండాలి అనే విషయంపై జగన్ అమిత్ షాతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు