భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.కేరళలోని తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.
రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న గౌహతిలో, చివరి టీ20 మ్యాచ్ ఇండోర్లో అక్టోబర్ 4న జరగనుంది.సౌతాఫ్రికాతో 3 టీ20 లతో పాటు 3 వన్డేలు కూడా భారత్ ఆడనుంది.
ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా విక్టరీ సాధించిన విషయం తెలిసిందే.