ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల తీవ్ర విమర్శలు నెలకొన్నాయి.వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్ నీ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు.
మరోపక్క విశాఖపట్నం పరిపాలన రాజధానిగా.వైసీపీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది.
ప్రభుత్వానికి సంబంధించి పెద్దపెద్ద కార్యక్రమాలు అన్నిటిని కూడా విశాఖలోనే నిర్వహిస్తూ ఉంది.ఇలాంటి తరుణంలో నేడు అమరావతిపై దాఖలైన ఎనిమిది కేసులకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది.
జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం బెంచ్ వీటిని విచారించనుంది.రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది.
రద్దు చేసిన చట్టాలపై తీర్పు సరికాదని ప్రభుత్వం తన వాదన వినిపించడం జరిగింది.దీంతో అమరావతి రాజధాని కేసులకు సంబంధించి విచారణ సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.