లోక్ సభ ఎన్నికలలో ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని ప్రధాని కావాలని ఆశపడుతున్న రాహుల్ గాంధీ, మరో వైపు మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తామ సత్తా చాటాలని మోడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ రాజకీయ క్షేత్రంలో దూసుకుపోతున్నారు.ఇక ఈ లోక్ సభ ఎన్నికలకి గాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు, ఫ్రీ హామీలతో మేనిఫెస్టోని ప్రజల ముందుకి తీసుకొచ్చింది.
దీనికి ప్రజల నుంచి కొంత మద్దతు లభిచింది.
బీజేపీ ఈ ఐదేళ్ళ కాలంలో వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ వారికి పరిష్కారం చూపిస్తామని రాహుల్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే చర్చ దేశ రాజకీయాలలో నడుస్తుంది.మోడీ విధానపరమైన నిర్ణయాలతో పాటు, గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో నల్లదనం వెలికితీసి ప్రజల అకౌంట్ లో వేస్తా అనే మాట గాల్లో కలిసిపోయిన నేపధ్యంలో మళ్ళీ అలాంటి ఫ్రీ హామీలు ఏమైనా ఇస్తారా, లేక కొత్త కార్యాచరణని మోడీ ప్రకటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.