కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ నేడు బాలల దినోత్సవం కావడంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు ప్రపంచంలో అందరి కంటే పిల్లలంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు.
ట్విట్టర్ ద్వారా రాష్ట్రంలోని బాలలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్ పలు సందర్భాల్లో పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తన పర్యటనల్లో పిల్లలతో ముచ్చటిస్తూ వాళ్లతో కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు.
తను పిల్లలతో దిగిన ఫోటోలతో పాటు ఒక చిన్నారి తనను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న ఫోటోను కూడా కేటీఆర్ షేర్ చేశారు.నిన్న కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బల్కం పేట్, మోడా మార్కెట్, సనత్ నగర్ లలో పర్యటించారు.
సనత్ నగర్ లో కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో చిన్నారి కేటీఆర్ ను ఫోటో తీశారు.ఆ ఫోటో గురించి కేటీఆర్ స్పందిస్తూ ఆ బాలుడు తన హృదయాన్ని దోచుకున్నాడని తెలిపారు, ఆ ఫోటో సనత్ నగర్ లో పలు వేదికలపై మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ తీశాడో తాను ఖచ్చితంగా తెలీదు కాని ఫోకస్ పెట్టి చిన్నారి ఫోటోను బాగా తీశాడని కేటీఆర్ అన్నారు.కేటీఅర్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేటీఆర్ మంత్రి హోదాలో, తీరిక లేనంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ, షేక్ హ్యాండ్ ఇస్తుండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.గతంలో నిరుపేద చిన్నారులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ తనవంతు సాయం చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఏ మాత్రం కల్మషం లేని పిల్లల గురించి కేటీఆర్ చేసిన పోస్టులకు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.