తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మొదట్లో కేసీఆర్ తో కలిసి చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.కానీ ఆ తరువాత తరువాత కేసీఆర్ కి కోదండరాం కి మధ్య వైరం రావడంతో … ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధికెక్కారు.
తరువాత కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్ ) పేరుతో కొత్తగా పార్టీ పెట్టి ప్రజా కూటమిలో చేరారు.
కానీ ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క సీటైనా గెలుచుకోలేక పోయింది తెలంగాణ జనసమితి.మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.ఒక్క చోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు.
టీజేఎస్ అభ్యర్థులు 13 చోట్ల బరిలోకి దిగారు.ఆ తర్వాత 5 చోట్ల అభ్యర్థులు ఉపసంహరించుకోగా.
ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ పోటీ చేసింది.