మేడ్చల్ సభలో సోనియా దగ్గర నుంచి… వరుసగా మాట్లాడిన నాయకులంతా … కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆయనకు ఓటు వేసినా వేయకపోయినా… ఆయన ఫామ్ హౌస్ లోనే పడుకుంటారని… అందువల్ల ఆయనకు ఓట్లు వేయవద్దని, టిఆర్ఎస్ కు ఓటు వేయడం వృధా అని ని టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శించారు.
ముందస్తు ఎన్నికలు రావడం అదృష్టమని అంటూనే… కూటమి వద్ద డబ్బులు లేవని అన్నారు.కెసిఆర్ భారీగా… డబ్బు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.టిఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బురదగుంటలోకే వెళుతుందని దుయ్యబట్టారు.ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.