కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ మృతి..!

దేశంలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది.నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Ap, Thirupathi, Ycp Mp, Durgaprasad, Corona Death-TeluguStop.com

ఇక ఈ వైరస్ సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.ఈ వైరస్ పేరు చెబుతూనే అందరు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇక ఈ వైరస్ బారినపడి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరికొంత మంది ఈ వైరస్ బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి వెళ్లారు.అయితే ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేఅంతవరకు అందరు మాస్కులు ధరించి, సామజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గతకొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ వైద్యులు ఆయనకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.ఈ నిర్దారణ పరీక్షల్లో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇక ఆయన వైద్యుల సూచనల మేరకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇక దుర్గాప్రసాద్‌ 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.ఆయన 8 ఏళ్లకే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు.అంతేకాకుండా నెల్లూరు జిల్లా గుడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1994లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో విద్యాశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఇక 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికైయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube