స్పెషల్ స్టేటస్ ఉద్యమం ఉద్రుతమవుతుందా ?

ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తుంగలో తొక్కితే ప్రజలు ఊరుకోరు.కొంత కాలం వేచి చూసినా వోపిక నశిస్తే పాలకుల చొక్కా పట్టుకుంటారు.

 Tirupati Shuts Down-TeluguStop.com

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది యిదే.రాష్ట్ర విభజన సమయంలో సమైక్యం కోసం పోరాడిన ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మళ్లి పోరాటం ప్రారంభించారు.

ఆదివారం తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభలో ఒక వ్యక్తీ ఆవేశంతో ఆత్మాహత్య చేసుకున్న విషాద ఘటన రాజకీయ పార్టీలకు ఆయుధం అయింది.ఈ ఘటన ఢిల్లి పాలకులను కూడా ఉలిక్కి పడేలా చేసింది.

భాజపా చేసిన మోసం ప్రజలకు ఆగ్రహం కలిగిస్తున్నది.సోమవారం తిరుపతి బంద్ సంపూర్ణంగా జరిగింది.

ఇక ముందు ఉద్యమం ఉద్రుతమయ్యే అవకాశం కనబడుతున్నది.ప్రత్యేక హోదా డిమాండ్ పై వెనక్కి తగ్గేదిలేదని పార్టీలు చెబుతున్నాయి.

ప్రత్యేక హోదా పై పోరాటం కొనసాగించాలని సోనియా, రాహుల్ ఏపీ కాంగ్రెస్ నాయకులకు నూరిపోసారు.వైకాపా అధినేత జగన్ ఈ రోజు దిల్లీలో ధర్నా చేసున్నారు.

కమ్యునిష్టు పార్టీలు కూడా ఆందోళనలు చేస్తున్నాయి.ఈ ఉద్యమం ఉదృతం అయ్యేలా ఉన్నదేగాని వెనక్కి తగ్గే వాతావరణం లేదు.

కేంద్రం పై చంద్రబాబు ఒత్తిడి తీసుకురాకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube