ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యం లో జరగబోయే ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు సత్తా చాటడానికి అనేక వ్యూహాలు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దిగగా, బిజెపి జనసేన కూటమి నుండి రత్నప్రభ అనే మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేయడానికి రెడీ అవుతుంది.
ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి దిగుతూ అధిష్టానం చింతామోహన్ అనే వ్యక్తిని తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
ఏప్రిల్ 17 వ తారీఖున జరగనున్న ఈ ఎన్నికలలో పార్టీ మెజార్టీ సాధించాలని అధికార పార్టీ ఆలోచన చేస్తుండగా మరోపక్క ఉప ఎన్నికలలో గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి విపక్ష పార్టీల నాయకులు ఆలోచన చేస్తున్నారు.మరియు ఉప ఎన్నికలలో తిరుపతి ప్రజలు ఏ పార్టీ నీ ఆదరిస్తారో చూడాలి.