తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగిందట.అయితే ఇప్పుడు కాదు ఆరు నెలల క్రితమే ఈ దొంగతనం జరిగిందట.
ఏకంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆలయ అధికారి దొంగతనం చేసినట్లుగా విచారణ కమిటీ నిర్థారించింది.ఈ విషయాన్ని ఇన్నాళ్లకు మీడియా ముందుకు ఆలయ అధికారులు తీసుకు వచ్చారు.
ఆలయంలో విధులు నిర్వర్తించే శ్రీనివాసులు ఈ పని చేసినట్లుగా నిర్థారించారు.ఆరు నెలలుగా ఆయన జీతం నుండి 25 వేల చొప్పున కట్ చేస్తున్నట్లుగా కూడా వారు చెప్పారు.
అయిదు కేజీల వెండి కిరీటంతో పాటు బంగారు నాణెలు, నక్లెస్ మరియు ఇతర ఆభరణాలను ఆయన చోరీ చేసేందుకు సహకరించాడు అంటూ విచారణలో వెళ్లడి అయ్యింది.చోరికి పాల్పడ్డ ఆయన్ను విధుల నుండి ఎందుకు బహిష్కరించడం లేదు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.
తిరుమల దేవస్థానం మొత్తం కూడా అవినీతి మయం అయ్యింది అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు.