తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాదం సంభవించింది.లడ్డూ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది.
ఆదివారం లడ్డూల కోసం బూందీ తయారు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.గోడలకు, పైకప్పుకు పేరుకుపోయిన నెయ్యి మరకలకు అగ్గి తగలడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.అగ్ని ప్రమాదం సంభవించడంతో లడ్డూల తయారీ నిలిచిపోయింది.దీంతో బూంది తయారీ కేంద్రం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.కాగా మంటలను అదుపు చేసే క్రమంలో ఓ కార్మికుడికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.