కరోనా టైం లో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.కరోనా తీవ్రత ఉదృతంగా ఉన్న సమయంలో శ్రీవారి దర్శన టికెట్లను తగ్గించారు.కరోన తీవ్రత దృష్ట్యా ఈ నెలలో కూడా శ్రీవారి టికెట్లను తగ్గించామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.5 వేల టికెట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు.తిరుమలలో భక్తులు సాధారణంగా ఉన్నారు.రాత్రి 9 గంటలకే శ్రీవారి ఏకాంత సేవ నివహించి ఆలయాని 9: 30 నిమిషాలకే మూసివేస్తున్నామని చెప్పారు.
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత దర్శనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.కరోనా టైం లో భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి వెనుకాడుతున్నారు.
అయితే ఈ టైం లో తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు మాత్రం స్వామి దర్శనం బాగా అందుతున్నదని తెలుస్తుంది.నిత్యం భక్తులతో కిటకిటలాడి దర్శనం ఒక నాలుగైదు సెకన్ల పాటే కలుగుతుంది.
కాని ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి మంచి దర్శనం అందుతున్నట్టు తెలుస్తుంది.అయితే తిరుమలలో ఒకప్పటిలా భక్తులు రద్దీ ఉండాలంటే కరోనా తీవ్రత పూర్తిగా తగ్గాల్సిందే.
కరోనా ఉన్నా సరే కొందరు ఇప్పటికి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు.అలాంటి వారికి కేటాయించిన దర్శన టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి.