తిరుమల శ్రీవారి దర్శణం కోసం కొత్త సంవత్సరం కారణంగా డిసెంబర్ 30 నుండి నిన్నటి వరకు అంటే జనవరి 1వ తారీకు వరకు జనాలు బారులు తీరిన విషయం తెల్సిందే.సాదారణ దర్శణంకు 24 నుండి 30 గంటలు సమయం కూడా పట్టింది.
మూడు రోజుల పాటు తిరుమలను దర్శించుకున్న వారి సంఖ్య భారీగా ఉంది.అయితే నేడు దర్శణంకు జనాలు పెద్దగా లేరు.
హాలీడేస్ పూర్తి అవ్వడంతో పాటు సాదారణ రోజు అదే వర్కింగ్ డే అవ్వడం వల్ల తిరుమల శ్రీవారి దర్శణంకు జనాలు పెద్దగా లేరు.
క్యూ కాంప్లెక్స్ల్లో ఉన్న వారికి గంటన్నర నుండి రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది.
కాలినడకన వెళ్లే వారికి నేరుగా దర్శకత్వం కలుగుతుంది.రెండు గంటల్లో సాదారణ భక్తులు దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేలా పరిస్థితి ఉంది.
సంక్రాంతి సెలవుల్లో రావాలనుకునే వారు ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు.అందుకే ఈ వారం రోజులు తిరుమల వెల వెల పోతుందని స్థానికులు అంటున్నారు.
ఇప్పుడు ఖాళీగా ఉండి వెళ్లాలి అనుకునే వారు వెంటనే వెళ్లడం బెటర్.ఆ తర్వాత వెళ్లినా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.